అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రం " ప్రేమాభి షేఖం ". చిత్ర దర్శకుడు శ్రీ దాసరి నారాయణ రావు . మంచి కథ, మంచి సంగీతం, అక్కినేని, శ్రీదేవి, జయసుధ ల ఉత్తమ నటన తో పాటు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం పాటలు, చిత్ర విజయానికి ఎంతో తోడ్పడ్డాయి అందడం లో ఎంత మాత్రం సంశయం లేదు. అన్ని పాటలకు శ్రీ బాలు గారు ప్రాణం పోసారు. ముఖ్యంగా చిత్రం లో వచ్చే చివరి పాట ' ఆగదు ఏ నిముషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము' ఎంతో భావగార్భంగా పాడి, చిత్రానికే వన్నె తెచ్చారు. ఇప్పటికి ఈ పాట వింటే, కళ్ళలో నీళ్ళు వస్తాయి. గీత రచన శ్రీ దాసరి, సంగీతం శ్రీ చక్రవర్తి. బాలు గారి సినీ ప్రస్థానంలో ఒక ఉత్తమ పాటగా నిలిచిపోయింది ఈ పాట. ఆ పాట విందాము.
No comments:
Post a Comment